హైదరాబాద్: 2019 ఓటరు జాబితా ఆధారంగానే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమన్వయ కర్త మర్రి శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు. 2018 ఓటరు జాబితాతో బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తే బీసీలు తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు. బలహీన వర్గాలపట్ల తెరాస వైఖరి సరిగాలేదని ఆరోపించారు. ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసి తప్పుల తడకగా ఉన్న ఓటర్ల లిస్టుతో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చూస్తోందని ఆక్షేపించారు. ఓటరు లిస్టును సరిచేసే బాధ్యత ప్రభుత్వంతోపాటు ఈసీ పైనా ఉందన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm