ఢిల్లీ: ఛత్తీస్గడ్ ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఉత్కంఠ మరో రోజు కొనసాగనుంది. శనివారం ఛత్తీసగఢ్ సీఎం ఎవరనేది ప్రకటిస్తారని వార్తలు వెలువడ్డాయి. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జి పీఎల్ పునియా స్పందించారు. 'ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు కాంగ్రెస్ నేతలు సమావేశం కానున్నారు. ఆ తర్వాత సీఎం ఎవరనేది ప్రకటిస్తారు. ప్రమాణస్వీకారం చేయడానికి డిసెంబరు 17 సాయంత్రం 4.30 వరకు గవర్నర్ మాకు అవకాశం ఇచ్చారు. కనుక తొందరపడాల్సిన అవసరం ఏమీ లేదు' అని ఆయన చెప్పుకొచ్చారు.
Mon Jan 19, 2015 06:51 pm