శ్రీకాకుళం: పెథాయ్ తుఫాన్ తీవ్రత దృష్ట్యా తీర ప్రాంతవాసులను అలర్ట్ చేస్తున్నారు అధికారులు. జిల్లాలోని 11 తీర ప్రాంత మండలాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఆయా మండలాల్లోని అధికారులకు సెలవులు రద్దు చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. మండల, డివిజన్ స్థాయిలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి.. తుఫానుపై గ్రామాల్లో దండోరా వేయించాలని ఆదేశించారు. చేపల వేటకు వెళ్లొద్దంటూ మత్స్య కారులకు హెచ్చరికలు జారీ చేశారు. విద్యుత్ సౌకర్యానికి జనరేటర్లు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm