హైదరాబాద్ : వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 2019 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండినవారు, ఇప్పటివరకు ఓటరుగా నమోదు కానివారు, పేరు తొలగింపునకు గురైనవారు దరఖాస్తు చేసుకోవచ్చని, ఆన్లైన్లోనూ సమర్పించవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్కుమార్ తెలిపారు. ప్రస్తుత ఓటర్ల జాబితాను ఈ నెల 26న ప్రదర్శిస్తామని, ఆ రోజు నుంచి 2019 జనవరి 26 వరకు ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులకు అవకాశం ఉం టుందన్నారు. ఓటర్ల అభ్యంతరాలూ స్వీకరిస్తామని.. 2019 ఫిబ్రవరి 11 లోపు అభ్యంతరాలను పరిష్కరించి ఫిబ్రవరి 18లోగా కొత్త జాబితాను ప్రకటిస్తామ న్నారు. తుది జాబితాను ఫిబ్రవరి 22న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm