హైదరాబాద్ : ఏపీలో సబ్ ఇన్స్పెక్టర్ల(ఎస్ఐ) నియామకానికి సంబంధించిన ప్రాథమిక పరీక్ష ఆదివారం జరగనుంది. మొత్తం 334 పోస్టులకు 1.35 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పేపర్ 1 పరీక్ష సరిగ్గా 10గంటలకు ప్రారంభమై 1 గంటకు ముగుస్తుంది. లంచ్ బ్రేక్ తర్వాత రెండో పేపర్ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు జరుగుతుంది. అభ్యర్థులను గంట ముందుగా పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ కుమార్ విశ్వజిత్ తెలిపారు. నిముషం ఆలస్యమైనా అనుమతించబోమన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm