హైదరాబాద్ :ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని అంబేద్కర్ నగర్లో ఇంట్లో ఎవరూ లేని సమయంలో తలుపులు పగులగొట్టి రూ.10లక్షల విలువైన బంగారం చోరీ చేశారు. బాధితుల వివరాల ప్రకారం... ఉబ్బన నాగరాజు భద్రాద్రి జిల్లా గుండాలలో లెక్చరర్గా పనిచేస్తున్నారు. అతని భార్య కాంతాకుమారి అదే జిల్లాలోని చండ్రుగొండ కస్తూర్భా స్కూల్లో ఎస్ఓగా పనిచేస్తున్నారు. వీరు ఇరువురు సోమవారం తమ డ్యూటీలకు వెళ్లారు. వీరి పిల్లలు విజయవాడ వెళ్లారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఏడు గంటల సమయంలో ఉద్యోగ విధుల నుంచి తిరిగి ఇంటికి వచ్చిన వారు గేటు తాళం తీసి ఇంట్లోకి వెళ్లగా బిరువా పగుటగొట్టి ఇళ్లంతా చిందరవందరగా పడి ఉంది. కాగా వారి కుమార్తె వివాహ నిమిత్తం రూ.10లక్షల బంగారం బిరువాలో పెట్టగా దాన్ని గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. ఈ విషయాన్ని ఎస్ఐ మేడా ప్రసాద్కు సమాచారం అందించగా హుటాహుటీన ఘటనా స్థలాన్ని సందర్శించి క్లూస్ టీంకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తన్నారు. కాగా ఈ ఘటన ఎప్పుడు జరిగిందన్న విషయం ఇంకా తెలియరాలేదు.
Mon Jan 19, 2015 06:51 pm