హైదరాబాద్ : కేటీపీపీలో మళ్లీ విద్యుత్ ఉత్పత్తికి బ్రేక్ పడింది. రెండు ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి ఆగిపోవడంతో కరెంట్ సమస్య తలెత్తుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరులోని కేటీపీపీలో 500 మెగావాట్లు, 600 మెగావాట్ల ప్లాంటు ఉన్నాయి. మొత్తం ఇక్కడ ప్రతీ రోజు 1100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. అయితే గురువారం రాత్రి కేటీపీపీలోని రెండోప్లాంటు 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. అనంతరం కొద్దిపాటి మరమ్మతులు చేసి ప్లాంట్ను సింక్రనైజేషన్ చేయగా మొరాయించింది. అదే రోజు రాత్రి ప్లాంట్ను నిలిపివేసి జెన్కో ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను రప్పించి టర్బన్ జనరేటర్లో మరమ్మతులు చేపట్టారు. అయినప్పటికీ టర్బన్ రూటర్లో సమస్యలు మాత్రం గుర్తించలేకపోయారు. దీంతో ప్లాంట్ పూర్తిగా నిలిచిపోయింది.
Mon Jan 19, 2015 06:51 pm