హైదరాబాద్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందకపోవటం, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు సరైన సేవలు లభించకపోవటం చిన్నప్పటి నుంచి తనను బాధిస్తోందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా ఆయన డల్లాస్లో ఎన్నారై వైద్యులతో ఆయన సమావేశమయ్యారు. పేదలు పడుతున్న కష్టాలు, వాటికి పరిష్కారం దొరక్క వారు పడుతున్న ఇబ్బందులు చూసి ఓ దశలో విప్లవకారుడిగా మారదామనే ఆలోచన వచ్చిందని గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Mon Jan 19, 2015 06:51 pm