హైదరాబాద్: బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్లో భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు విజయం సాధించడంపై ఆమె తండ్రి పీవీ రమణ హర్షం వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం ఐదు ఫైనల్స్ ఆడినప్పటికీ.. సింధు రజతంతోనే సరిపెట్టుకుంది. అయితే ఎంతో ప్రతిష్ఠాత్మకమైన బీడబ్ల్యూఎఫ్ ఫైనల్లో గెలిచి సత్తా చాటింది. గతంలో ఫైనల్ మ్యాచ్ల్లో ఓడిపోయినప్పుడు ఎంతో బాధపడేది. అయితే మన ప్రయత్నం మనం చేయాలని, తప్పకుండా విజయం సాధిస్తావ్ అని చెప్పేవాడిని. ఈ టూరుకు ముందు నుంచి ఎంతో ఆత్మవిశ్వాసంతో సింధు ఉంది. అందుకు కఠోర శ్రమ కూడా తోడయింది. ప్రాక్టీస్ సెషన్లు ఏదీ మిస్ కాలేదు. కోచ్లు చెప్పిన సూచనలు పాటించి ఈ విజయం సాధించింది. వరల్డ్ నం.1 కావాలన్నదే సింధు లక్ష్యం. ఒలింపిక్ క్వాలిఫికేషన్ ఉన్నందున ఈ సంవత్సరం సింధుకు ఎంతో కీలకమైనది్ణ్ణ అని రమణ అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm