హైదరాబాద్ : రాజకీయాలు అన్నాక గెలుపోటములు సహజమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కె.జానారెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఓటమిపై కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందవద్దనీ, ఆపద వస్తే ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ధైర్యం చెప్పారు. తెలంగాణ ప్రజలు ఈసారి కేసీఆర్ మాయలో పడిపోయి టీఆర్ఎస్ కు ఓట్లు వేశారని అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ నేతలు భారీగా నగదును ఖర్చు పెట్టారని ఆరోపించారు. నల్లగొండ జిల్లా నిడమనూరులో నిర్వహించిన కాంగ్రెస్ సమీక్షా సమావేశంలో జానా పాల్గొన్నారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం కాంగ్రెస్ కార్యకర్తలు అద్భుతంగా పనిచేశారని జానారెడ్డి కితాబిచ్చారు. ప్రజలే తన ఆస్తిపాస్తులని, ఓట్లు కొనేందుకు తన వద్ద డబ్బులు లేవన్నారు. రాజకీయాల్లో విలువలు ముఖ్యమనీ, పదవుల కోసం దిగజారలేనని వ్యాఖ్యానించారు. కావాలని కోరుకుంటే తెల్లారేసరికి పదవి తెచ్చుకునే సత్తా తనకు ఉందని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Dec 16,2018 01:22PM