న్యూఢిల్లీ: తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు అమెరికాకు చెందిన మల్టీనేషనల్ కంపెనీ మైక్రోసాఫ్ట్ సరికొత్త టాబ్లెట్ను విడుదల చేసింది. ఇండియా మార్కెట్లో మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ గో టాబ్లెట్ ప్రీ-ఆర్డర్స్ ప్రారంభమైనట్లు కంపెనీ పేర్కొంది. మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ గో 10 అంగుళాల విండోస్ టాబ్లెట్ రూ. 37,999 అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. కీబోర్డు ఆప్షన్ ఉన్న టాబ్లెట్ను అమెరికా మార్కెట్లో జులై నెలలో ప్రవేశపెట్టినట్లు కంపెనీ వెల్లడించింది. వై-ఫై వేరియంట్ గల మైక్రోసాఫ్ట్ టాబ్లెట్ కోసం ఫ్లిప్కార్ట్ ద్వారా బుక్ చేసుకోవచ్చని కంపెనీ స్పష్టం చేసింది. గత నెలలో ఎల్టీఈ వేరియంట్ టాబ్లెట్ను అంతర్జాతీయ మార్కెట్లోకి విడుదల చేసినట్లు, వై-ఫై వేరియంట్ సర్ఫేస్ గో టాబ్లెట్ త్వరలో భారత మార్కెట్లోకి అందుబాటులోకి రానుందని మైక్రోసాఫ్ట్ కంపెనీ పేర్కొంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Dec 16,2018 05:41PM