హైదరాబాద్: ఈనెల 19 నుంచి బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. బతుకమ్మ పండుగ సందర్భంగా పంచడానికి ప్రభుత్వం సిద్ధమైనప్పటికీ.. కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదు వల్ల ఆగిపోయిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ప్రస్తుతం క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్టియన్లకు పంచే దుస్తులతో పాటు బతుకమ్మ చీరలను కూడా పంపిణీ చేయాలన్నారు. ఇకపై ఎమ్మెల్యేల ద్వారానే కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ జరుగుతుందని సీఎం స్పష్టం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm