హైదరాబాద్: ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నా సంక్షేమ పథకాలు మళ్ళీ కేసీఆర్ గద్దెను ఎక్కించాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. తాము ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని తెలిపారు. ప్రజాకూటమి తరపున చంద్రబాబు ప్రచారం నచ్చకనే టీఆర్ఎస్కు ఓటేశారని ఆయన చెప్పుకొచ్చారు. ఈ విషయంపై కూటమిలోని పార్టీలకు కనువిప్పు కలగాలన్నారు. కూటమిలోని పార్టీలు భవిష్యత్లో తమతో కలిసి వస్తాయని ఆశిస్తున్నామని తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm