హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బహిరంగ మూత్ర విసర్జన నివారణ కోసం జిహెచ్ఎంసి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తేంది. అంతేకాకుండా బహిరంగ మూత్ర విసర్జన చేసే ప్రాంతాల్లో ముగ్గులు వేయడం, పెయింటింగ్ వేయడం, వాలంటీర్లను నియమించడం తదితర కార్యక్రమాలు అమలు చేస్తున్నా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో గుర్తించిన ప్రాంతాల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలని నిశ్చయించారు. నగరంలోని 28 ప్రాంతాల్లో ఎక్కువగా బహిరంగ మలవిసర్జన చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు ఆయా ప్రాంతాల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు ఆయా ప్రాంతాల్లో యూరినల్స్ను ఏర్పాటు చేయాలని బల్డియా కమీషనర్ దానకిశోర్ జోనల్, డిప్యూటి కమీషనర్లను ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘించేవారికి జరిమానా విధించాలని ఆయన స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేస్తే రూ. 100 ,చెత్త వేస్తే రూ. 100,డ్రైన్లలో చెత్త వేస్తే రూ.1000, రోడ్లపై చెత్త వేస్తే రూ.2000, కుండీ పక్కకు చెత్త వేస్తే రూ.100, నిర్మాణ వ్యర్థాలో రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో వేస్తే రూ.10,000, నాలాల్లో చెత్త వేస్తే రూ.10,000, జరిమానా విధించే అవకాశం ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm