హైదరాబాద్: తన అతిథి గృహాన్ని అధికారులు నిన్న సీజ్ చేయండంపై ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు హైకోర్టు న్యామమూర్తి జస్టిస్ ప్రవీణ్ ముమార్ విచారణ చేపట్టారు. నిబంధనలను పాటించకుండా కనీసం నోటిసు కూడా ఇవ్వకుండా సీజ్ చేయడం చట్ట విరుధ్తమని ప్రభాస్ తరపు న్యాయవాది వాదించారు. ఈవ్యాజ్యాన్ని ధర్మాసనానికి బదిలీ చేయాలని రిజిస్ట్రేని న్యాయమూర్తి ఆదేశించారు. ఈపిటిసన్పై ధర్మాసనం గురువారం విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం
Mon Jan 19, 2015 06:51 pm