బెంగళూరు: అసెంబ్లీలో కూర్చుని ఫోనులో మహిళల ఫొటోలు చూస్తూ రెడ్హ్యాండెడ్గా దొరికిపోయారు కర్ణాటకకు చెందిన బహుజన్ సమాజ్ పార్టీ నేత. దీనికంటే మరో షాకింగ్ విషయం ఏంటంటే...తన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి అతను చెప్పిన సమాధానం. వివరాల్లోకెళితే.. మహేశ్ అనే బీఎస్పీ నేత సోమవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. అనంతరం ఫోను తీసి ఆడవాళ్ల ఫొటోలు చూస్తూ కూర్చున్నారు. ఈ దృశ్యం కాస్తా అక్కడి ఛానెళ్ల కంట పడింది. దాంతో మహేశ్ పనితీరుపై ఇతర నేతలు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ విషయం గురించి స్థానిక మీడియా వర్గాలు ఆయన్ను ప్రశ్నించగా.. అసెంబ్లీలోకి ఫోన్ తీసుకెళ్లినందుకు నన్ను క్షమించండి. మా అబ్బాయి కోసం సంబంధాలు చూస్తున్నాం. మంచి అమ్మాయి దొరుకుతుందేమోనని ఫొటోలు చూశాను. ఇంకెప్పుడూ ఇలా చేయను్ణ అని చెప్పారు. అతని సమాధానం విని కంగుతినడం విలేకర్ల వంతైంది. అంతటితో ఆగకుండా ఈ చిన్న విషయాన్ని రాద్దాంతం చేసి చూపించారంటూ మీడియా వర్గాలపై మహేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేం జర్నలిజం? ప్రతీ చిన్న విషయాన్ని భూతద్దంలో చూపిస్తున్నారు. ఓ తండ్రిగా నా బాధ్యతను నేను నిర్వర్తిస్తున్నాను. అని తనని తాను సమర్థించుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Dec 19,2018 05:35PM