విశాఖ:ఎన్నికలు నాలుగు నెలలు ఉండగానే ఏపీలో రాజకీయం ఊపందుకుంటుంది. పొత్తులు.. సీట్లు అంటూ అటు ప్రజలతో పాటు పార్టీల నేతలు కూడా మిత్రులకు శత్రువులకు సిగ్నల్స్ ఇచ్చేస్తున్నారు. తాజాగా విశాఖపట్నంలో జరుగుతున్న సీపీఐ జాతీయ సమితి సమావేశాల్లో మాట్లాడిన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వచ్చే ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం, జనసేన కలిసే పోటీ చేస్తాయని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలు నడుస్తున్నాయన్న అయన ఏపీలోరెండు కుటుంబాల పాలన జరుగుతుందన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో మార్పు కోసం జనసేన వస్తోందని.. మేము మార్పు కోసమే జనసేనతో కలిసి వస్తామన్నారు. సీపీఎం నిన్న తెలంగాణలో టీడీపీ-కాంగ్రెస్తో కలిసి పనిచేసింది. మరి సిపిఐ పొత్తు గురించి అంటే రామకృష్ణ చెప్పారు కానీ సీపీఎం పొత్తు గురించి కూడా అయన చెప్పినట్లే జరుగుతుందా అన్నది చూడాలి.
Mon Jan 19, 2015 06:51 pm