న్యూడిల్లీ : దేశంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. మోదీ సర్కార్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. దీనికి ఇటీవల 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలే నిదర్శనం. ఇదే అదునుగా భావించిన విపక్షాలు.. బీజేపీ సర్కార్ ను దించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో నిన్న, మొన్నటి దాకా కారాలు, మిరియాలు నూరుకున్న పార్టీలు సైతం ఏకమవుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ తో తెలుగుదేశం పార్టీ జత కట్టగా.. అదే బాటలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఆప్ తో పొత్తుపై ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షీలాదీక్షిత్ స్పందించారు. పొత్తులపై కాంగ్రెస్ హైకమాండే నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఆ నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Dec 19,2018 07:17PM