హైదరాబాద్: జూబ్లీహిల్స్లో దారుణం చోటుచేసుకుంది. వాచ్మ్యాన్ రూమ్లో ఊపిరాడక తల్లీకుమారుడు మృతి చెందారు. మృతులు ఓ ఇంట్లో పని మనుషులుగా పనిచేస్తున్నారు. మృతులను బుచ్చివేణి, పద్మారాజుగా గుర్తించారు. చలికి బొగ్గుల కుంపటి పెట్టడంతో ఇళ్లంతా పొగ వ్యాపించింది. మృతులు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం వాసులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm