విశాఖ: వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో అర్థంకావడం లేదని మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి విమర్శించారు. ప్రధాన ప్రతిపక్షంగా వైసీపీ విఫలమైందని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలపై ప్రభుత్వాన్ని జగన్ ప్రశ్నించడం లేదని, విభజన హామీలపై ప్రధాని మోదీ, చంద్రబాబు ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆయన దుయ్యబట్టారు. ఏపీకి న్యాయం జరగాలంటే రాష్ట్రం, కేంద్రంలో కాంగ్రెస్ రావాలని కిరణ్కుమార్రెడ్డి అన్నారు.ఏ ముఖం పెట్టుకుని రాష్ట్రానికి మోదీ వస్తారని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి నిలదీశారు. ప్రత్యేక హోదా భిక్ష కాదని ఏపీ ప్రజల హక్కని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ఏపీకి హోదా వస్తుందని రఘువీరా చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm