తిరుపతి: తిరుపతిలో రాష్ట్రస్థాయి వ్యవసాయ పరిశోధన విస్తరణ సలహామండలి భేటీ అయింది. తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో జరిగిన ఈ సమావేశానికి ఎన్జీ రంగా వ్యవసాయ వర్శిటీ వీసి దామోదర నాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గతంలో క్రమశిక్షణ చర్యలలో భాగంగా సస్పెండ్ అయిన ఓ ఉద్యోగి సమావేశం జరుగుతుండగా వీసీకి వినతి పత్రం ఇచ్చాడు. సస్పెండ్ వ్యవహారం కోర్టులో ఉన్నందున వీసీ వినతిపత్రం తీసుకోవడానికి నిరాకరించారు. దీంతో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీసీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వినతిపత్రం తీసుకోవాలని తీవ్రపదజాలంతో దుర్భాషలాడారు. సమ్మెలో ఉన్న వ్యవసాయ విద్యార్థులతో నిరసనకు దిగిన ఎమ్మెల్యే వీసీ సస్పెండ్ చేయాలనీ డిమాండ్ చేశారు. దీంతో పరిశోధనా స్థానం ఆందోళనలు మొదలయ్యాయి.
Mon Jan 19, 2015 06:51 pm