అమరావతి: గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు కేబినెట్ భేటీ కానుంది. పెథాయ్ తుపాను నష్ట పరిహారంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం చెల్లింపుతో పాటు కోర్టు కేసులపైనా ఈ భేటీలో చర్చించనున్నారు. సీఎం చంద్రబాబు విడుదల చేసే శ్వేతపత్రాలపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. పోలవరం ప్రాజెక్టు, అమరావతి సచివాలయం ర్యాఫ్ట్ ఫౌండేషన్లపై కూడా ఈ భేటీలో ఓ నిర్ణయం తీసుకోనున్నారు. కడప ఉక్కు కర్మాగారం శంకుస్థాపన ఏర్పాట్లపైనా చర్చించనున్నారు. జనవరి నుంచి ప్రారంభమయ్యే జన్మభూమి-మాఊరు కార్యక్రమంపై కూడా కేబినెట్ భేటీలో చర్చించనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm