కోల్ కతా : బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ షాకిచ్చారు. రాష్ట్రంలోని ఝర్ గ్రామ్ లో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొనాల్సి ఉండగా అక్కడ ఆయన హెలికాఫ్టర్ దిగడానికి ప్రభుత్వం అనుమతించలేదు. దీంతో అమిత్ షా పర్యటన రద్దయింది. ఈ సభకు బీజేపీ నాయకులు కైలాష్ విజయ్ వర్గియా, రూపా గంగూలీ హాజరవుతారని అనుకుంటున్నారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా హాజరవుతారని తెలుస్తోంది. అమిత్ షా హెలికాఫ్టర్ కు అనుమతి నిరాకరించడం ఇది రెండోసారి.
Mon Jan 19, 2015 06:51 pm