న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఇవాళ రిపబ్లిక్ డే డ్రెస్ రిహార్సల్స్ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పరేడ్లో పాల్గొనే వివిధ వాహనాలు కనువిందు చేశాయి. ఈనెల 26వ తేదీన ఆర్డీ పరేడ్ నిర్వహించనున్నారు. ఇవాళ జరిగిన రిహార్సల్స్ను భారీ సంఖ్యలో జనం ప్రత్యక్షంగా వీక్షించారు. ఆర్మీ తన ఆయుధాలను ప్రదర్శించారు. విజయ్ చౌక్ నుంచి రెడ్ ఫోర్ట్ వరకు ఈ పరేడ్ ఉంటుంది. అయితే ఆ రోజున మెట్రో సర్వీసులు మాత్రం ఉంటాయి. పరేడ్ ఉదయం 9.50 నిమిషాలకు విజయ్ చౌక్ నుంచి స్టార్ట్ అవుతుంది. రాజ్పథ్, తిలక్మార్గ్, బహదూర్ షా జఫర్ మార్గ్, నేతాజీ సుభాష్ మార్గ్ మీదుగా ఎర్రకోటకు వెళ్తుంది. ఉదయం 9 గంటలకు ఇండియా గేట్ వద్ద అమర జవాన్లకు నివాళి అర్పిస్తారు. జనవరి 25 సాయంత్రం ఆరు గంటల నుంచే ఈ రూట్లో ట్రాఫిక్ను నిలిపేస్తారు. బెలూన్లు కానీ, పారా గ్లైడర్లను కానీ ఈ రూట్లో ఎగరవేయరాదు అని ట్రాఫిక్ అధికారులు హెచ్చరించారు.
Mon Jan 19, 2015 06:51 pm