న్యూఢిల్లీ : సోనియా గాంధీ కుమార్తె ప్రియాంకా గాంధీ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించనున్నారు. ప్రియాంకా గాంధీని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించి యుపి బాధ్యతలు అప్పగించారు. దీనితో ప్రియాంకా గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినట్లయింది. మోడీకి టార్గెట్గా కాంగ్రెస్ పార్టీ ప్రియాంకను రంగంలోకి దింపింది. లోక్సభకు త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నూతన వ్యూహాలు అమలు చేయడానికి నిర్ణయించింది. ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఉత్తర్ ప్రదేశ్ ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక నియామకంతో పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm