బెంగళూరు : ప్రధాని నరేంద్ర మోడీకి సెలబ్రిటీల వివాహాలకు, బాలీవుడ్ తారలను కలవడానికి సమయం ఉందని, కానీ లింగాయత్ పీఠాధిపతి శివకుమార స్వామి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు సమయం లేదని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర విమర్శించారు. స్వామి అంత్యక్రియలకు రాకుండా మోడీ ఎగ్గొట్టారని అన్నారు. శివకుమార స్వామికి భారతరత్న పురస్కారం ప్రదానం చేయాలని చాలాసార్లు అభ్యర్ధించినా పట్టించుకోలేదని అన్నారు. ప్రధాని స్వామి అంత్యక్రియలకు హాజరైవుంటే ఆయన స్థాయి పెరిగేదన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jan 23,2019 01:33PM