గువహటి : 2016 లో వచ్చిన వరదల సమయంలో కాపాడిన రెండు రైనోలను ఫారెస్ట్ అధికారులు కజిరంగా నేషనల్ పార్కు నుంచి మానస్ నేషనల్ పార్కుకు తరలించారు. అసోం అటవీ శాఖ అధికారులు, జంతు సంక్షేమం, విల్డ్లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అధికారుల సమక్షంలో మగ, ఆడ రైనోలను మానస్ పార్కుకు తరలించినట్లు కజిరంగా పార్కు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. వరదల సమయంలో కాపాడిన రెండు రైనోలను ప్రత్యేక పర్యవేక్షణలో పెంచి..వాటిని విజయవంతంగా మానస్ నేషనల్ పార్కుకు తరలించడం సంతోషంగా ఉందని వైల్డ్లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ప్రతినిధి రతిన్ బర్మన్ తెలిపారు. రెండు రైనోల చేరికతో మానస్ పార్కులో రైనోల సంఖ్య 38కు చేరుకున్నట్లు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm