న్యూఢిల్లీ: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకల పరేడ్లో పాల్గొనే అవకాశం చేజార్చుకుంది. సీఐఎస్ఎఫ్ ఈ ఏడాది యాభై వసంతాలు పూర్తి చేసుకోగా, ఇటు పరేడ్లో చోటు దక్కలేదు. రాజ్పథ్లో నిర్వహించే రిపబ్లిక్డే పరేడ్లో పాల్గొనేందుకు రక్షణ మంత్రిత్వ శాఖను సంప్రదించడంలో ఆలస్యమవ్వడంతో ఈసారి సీఐఎస్ఎఫ్ అవకాశాన్ని కోల్పోయింది. దీనిపై హోం, రక్షణ శాఖల మధ్య వివాదం తలెత్తింది. పరేడ్లో కేవలం మూడు పారామిలిటరీ బలగాలకు మాత్రమే అవకాశం ఉంటుందని, ఈ ఏడాది దిల్లీ పోలీసులు, అసోం రైఫిల్స్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్లు పాల్గొంటున్నాయని రక్షణ శాఖ వెల్లడించింది. ఈ ఒక్కసారికి నాలుగు ఫోర్స్లకు అవకాశం ఇవ్వాలని, సీఐఎస్ఎఫ్ను కూడా అనుమతించాలని హోం శాఖ రక్షణశాఖను కోరుతోంది. పరేడ్లో పాల్గొనేందుకు అందరికీ అవకాశం వచ్చేందుకు ఏటా పారామిలిటరీ ఫోర్స్లను మారుస్తుంటారు. 2017లో సీఐఎస్ఎఫ్కు అవకాశం దక్కింది.
Mon Jan 19, 2015 06:51 pm