న్యూఢిల్లీ: ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించడం మోడీ ప్రభుత్వ మరో తొందరపాటు నిర్ణయమని ఆర్జెడీ నాయకుడు తేజస్వి యాదవ్ విమర్శించారు. ఈ రిజర్వేషన్లతో ప్రభుత్వం మంట రగిలించిందని, తాము మోసపోయామని బహుజనులు భావిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం తొందరపాటుతో పెద్ద నోట్లు రద్దు చేసిందని, అదే విధంగా ఈ రిజర్వేషన్ల విషయంలోను అలాంటి నిర్ణయమే తీసుకుందని అన్నారు. ఏ కమిషన్ నివేదిక లేకుండా, సామాజిక, ఆర్ధిక సర్వే లేకుండా రాజ్యాంగానికి సవరణ చేసిందని విమర్శించారు. ఈ నిర్ణయం ఫలితాన్ని బీజేపీ అనుభవించాల్సి వస్తుందన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm