హైదరాబాద్ : మూడు దశాబ్దాల్లో ఎన్నడూ లేని రీతిలో జరిగిన పుల్వామా దాడి వెనుక ఉన్నది ఓ 22 ఏళ్ల యువకుడు. పన్నెండో తరగతితోనే స్కూల్కు గుడ్బై చెప్పి ఉగ్రవాదం వైపు ఆకర్షితుడైన వ్యక్తి. అతని పేరు ఆదిల్ అహ్మద్ దార్. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఆత్మాహుతి దళంలో సభ్యుడు. ఇప్పుడు దాడి జరిగిన ప్రదేశానికి కేవలం పది కిలోమీటర్ల దూరంలోనే అతను ఉండేవాడు. అతనుండే ప్రాంతం పేరు గుండిబాగ్. 2017 మార్చిలో అక్కడి స్కూల్ డ్రాపౌట్ అతడు. అతడు సీ కేటగిరీ మిలిటెంట్గా పోలీసు రికార్డుల్లో ఉంది. 2018 నుంచి అతను కనిపించకుండా పోయాడు. చదువు ఆపేసిన తర్వాత జైషే మహ్మద్తోపాటు హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే తోయిబాలాంటి ఉగ్రవాద సంస్థల సభ్యులతో తిరిగేవాడు. అతనేమీ పెద్ద ఉగ్రవాది కాదు. పుల్వామాలోని చాలా మంది మిలిటెంట్లలో అతనూ ఒకడు. 2018 నుంచి కనిపించకుండా పోయాడు అని స్థానిక పోలీసు అధికారి ఒకరు చెప్పారు. ఆదిల్ తండ్రి రియాజ్ అహ్మద్ దార్ స్థానికంగా ఓ చిన్న దుకాణాన్ని నడుపుతున్నాడు. ఎన్కౌంటర్లో తన కజిన్ చనిపోయిన తర్వాత ఆదిల్ చదువు ఆపేసి ఉగ్రవాదంవైపు వెళ్లినట్లు స్థానికులు వెల్లడించారు. ఈ దాడి ఘటన వార్త తెలియగానే గుండిబాగ్లో పలువురు దార్కు అంత్యక్రియలు నిర్వహించడం విశేషం. గుండిబాగ్ నుంచి జైషే మహ్మద్ చేర్చుకున్న మూడో ఆత్మాహుతి దళ సభ్యుడు ఆదిల్. అంతకుముందు ఇద్దరు సభ్యులు ఇలాగే ఆత్మాహుతి దాడుల్లో చనిపోయారు.
Mon Jan 19, 2015 06:51 pm