హైదరాబాద్: పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో నిందితుడు రాకేష్రెడ్డి అసలు నిజాన్ని ఒప్పుకున్నాడు. జయరాం చనిపోతే ఆస్తులు వస్తాయని ప్లాన్ చేసి అతడిని హతమార్చినట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడు. జయరాం హత్యకు వారం ముందే స్కెచ్ వేశానని.. రూ.100 బాండ్ పేపర్లపై జయరాం సంతకాలు తీసుకున్నానని పోలీసులకు తెలిపాడు. జయరాంని దసపల్లా హోటల్ నుంచి వీణా మేడం డ్రైవర్నంటూ నటుడు సూర్య కార్లో తీసుకొచ్చినట్లు చెప్పాడు. జయరాంని హత్య చేస్తానని నలుగురికి ముందే చెప్పినట్లు విచారణలో రాకేష్ వెల్లడించాడు. రౌడీషీటర్ నగేష్, విశాల్(నగేశ్ అల్లుడు), తన డ్రైవర్ శ్రీనివాస్రెడ్డికి జయరాం చనిపోతేనే ఆస్తులు వస్తాయని చెప్పినట్లు రాకేష్ తెలిపాడు. జయరాం హత్య సమయంలో ఘటనాస్థలంలోనే నలుగురు వ్యక్తులు ఉన్నారని, హత్య చేశాక మృతదేహంతో నల్లకుంట పోలీస్స్టేషన్కు తాను వెళ్లినట్లు తెలియజేశాడు. అయితే సీఐ శ్రీనివాస్కు తన కారులో డెడ్ బాడీ ఉన్న సంగతి తెలియదని, యాక్సిడెంట్గా క్రియేట్ చేయమని సీఐ చెప్పగానే నందిగామ వెళ్లి కార్ను పడేశామని పోలీసుల విచారణలో రాకేష్రెడ్డి చెప్పాడు.
Mon Jan 19, 2015 06:51 pm