న్యూఢిల్లీ: పాకిస్థాన్ హై కమిషనర్ సోహేల్ మహమూద్కు ఇవాళ భారత విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే ఈ విషయాన్ని వెల్లడించారు. పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ పాక్ రాయబారికి సమన్లు జారీ చేసింది. ఆ దాడిలో 49 మంది జవాన్లు మృతిచెందారు. పాక్ అధికారికి డిమార్షే జారీ చేసింది. ఉగ్రవాద సంస్థ జైషే మహ్మాద్పై పాక్ వెంటనే కఠిన నిర్ణయం తీసుకోవాలని పాక్ రాయబారిని భారత్ ఆదేశించింది. పాక్ నేలపై నుంచి సాగుతున్న అన్ని రకాల ఉగ్ర కార్యకలాపాలను అడ్డుకునే చర్యలు చేపట్టాలని కోరింది. పుల్వామా దాడిపై గురువారం పాక్ విదేశాంగ శాఖ చేసిన ప్రకటనను భారత విదేశాంగ కార్యదర్శి ఖండించారు.
Mon Jan 19, 2015 06:51 pm