న్యూఢిల్లీ: ఆకట్టుకునే ఫీచర్లతో మెటరోలా కొత్త స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. 5వేల ఎంఏహెచ్ మెగా బ్యాటరీతో మోటరోలా జీ7 పవర్ మొబైల్ను శుక్రవారం ఆవిష్కరించింది. 15వాట్స్ టర్బోపవర్ సపోర్ట్ బ్యాటరీ, ఫింగర్ప్రింట్ స్కానర్ ప్రత్యేక ఫీచర్లని కంపెనీ చెబుతోంది. మొదటిసారిగా ఇండియాలో ఆఫ్లైన్ స్టోర్లల్లో కూడా ఈ ఫోన్ విక్రయానికి లభ్యం. మోటరోలా.ఇన్ వెబ్సైట్లో మోటో స్టోర్ లేదా మోటో హబ్, సిటీ, స్టేట్ ఎంచుకొని ఈ ఫోన్ను కొనుగోలు చేయవచ్చు. త్వరలో ఫ్లిప్కార్ట్లో కూడా ఈ మొబైల్ అందుబాటులోకి రానుంది.
మోటరోలా జీ7 పవర్ ఫీచర్లు
6.24 అంగుళాల ఫుల్ హెచ్డీండిస్ప్లే
720x1570 పిక్సెల్స్ రిజల్యూషన్
ఆండ్రాయిడ్ 9.0
స్నాప్డ్రాగన్ 632 ప్రాసెసర్
4 జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్
12ఎంపీ రియర్ కెమెరా
8 ఎంపీ సెల్ఫీ కెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాటరీ
ధర: రూ.13,999
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Feb 15,2019 03:08PM