మిర్యాలగూడ: అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నల్లగొండ జిల్లాలో ఈ నెల 6న విలేకరులమంటూ రైస్ మిల్లులలో అక్రమ వసూళ్లకు పాల్పడిన నలుగురిని నల్లగొండ జిల్లా మిర్యాలగూడ డీఎస్పీ శ్రీనివాస్ నిందితులను అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ముఠాగా ఏర్పడిన వీళ్లు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విలేకరులమంటూ వ్యాపారులను బెదిరించి అక్రమంగా డబ్బులు వసూలు చేశారని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఖమ్మం, నకిరేకల్తో పాటు పలు ప్రాంతాల్లో బాధితులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm