ముంబై: ఆస్ట్రేలియాతో జరగబోయే రెండు టీ20ల సిరీస్కు బీసీసీఐ టీమ్ను ప్రకటించింది. న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్కు విశ్రాంతి తీసుకున్న విరాట్ కోహ్లి మళ్లీ టీమ్లోకి వచ్చాడు. ఈసారి రోహిత్ శర్మకు విశ్రాంతినిస్తారని భావించినా.. అతన్ని కూడా టీమ్లో చోటిచ్చారు. ఇక తొలిసారి యువ లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండెకు నేషనల్ టీమ్లో చాన్సివ్వడం విశేషం. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న మార్కండె.. గతేడాది అద్భుతంగా రాణించాడు. ఇంగ్లండ్ లయన్స్తో ఇండియా ఎ ఆడుతున్న మ్యాచ్లోనూ మార్కండె ఐదు వికెట్లు తీసుకున్నాడు. ఇక తొలి రెండు వన్డేలకు, తర్వాతి మూడు వన్డేలకు వేర్వేరుగా టీమ్స్ను ప్రకటించింది. తొలి రెండు వన్డేల్లో పేస్ బౌలర్ సిద్దార్థ్ కౌల్కు అవకాశం ఇవ్వగా.. తర్వాతి మూడు వన్డేల్లో అతని స్థానంలో భువనేశ్వర్కు అవకాశమిచ్చారు.
Mon Jan 19, 2015 06:51 pm