ఢిల్లీ: జమ్మూకశ్మీర్ పుల్వామా జిల్లాలో అత్యంత నీచంగా, మోసపూరితంగా దొంగదెబ్బ తీసిన ఉగ్రవాద దాడిని ఎప్పటికీ మరచిపోం, ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించమని కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) ప్రకటించింది. 40 మందికి పైగా పొట్టన బెట్టుకున్న వారిని, వారికి సాయం చేసిన వారికి త్వరలోనే బుద్ది చెబుతామని.. దీనికి తప్పనిసరిగా ప్రతీకారం తీర్చుకుంటాం అని స్పష్టం చేసింది. జవాన్ల మరణానికి సీఆర్పీఎఫ్ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అధికారిక ఖాతాలో ట్వీట్ చేసింది. దాడిలో అమరులైన వారికి సెల్యూట్ చేస్తూ అమరులైన సోదరుల కుటుంబాలకు అండగా నిలుస్తామని ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ హేయమైన చర్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఉగ్రవాదులకు, పాక్కు కూడా గట్టి హెచ్చరిక పంపింది.
Mon Jan 19, 2015 06:51 pm