ఖమ్మం: జిల్లాలోని అశ్వారావుపేట మండలం వినాయకపురం ముత్యాలమ్మ ఆలయం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆలయ కమిటీ చైర్మన్ ఉప్పల మహేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డారు. దేవాలయం వద్ద దుకాణాల వేలంపాట నిర్వహిస్తుండగా ఫోన్ రావడంతో రోడ్డు పక్కన నిల్చుని మహేశ్వరరావు మాట్లాడుతున్నాడు. రోడ్డుపైన బైక్ అదుపుతప్పి ఆయనపైకి దూసుకువచ్చింది. తీవ్రంగా గాయపడిన చైర్మన్ను ఖమ్మంలోని ఆస్పత్రికి తరలించగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm