హైదరాబాద్: మిషన్ కాకతీయ, చిన్న నీటి వనరుల సంరక్షణపై సీఎం కేసీఆర్ ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రాజెక్టుల నీళ్లు, వర్షం నీళ్లు, పడబాటు నీళ్లు.. ఏవీ కూడా వృథా కావొద్దని.. అన్ని నీళ్లు నేరుగా చెరువులకు చేరేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. ఈ మేరకు వారంరోజుల్లోగా సమగ్ర నివేదికలు రూపొందించి ప్రభుత్వానికి అందించాలని ఆదేశించారు.
Mon Jan 19, 2015 06:51 pm