విజయవాడ: పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రస్తుతం అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో ఉంది. ఈ పనికి స్క్రీనింగ్ కమిటీని నియమించిన పవన్ కళ్యాణ్ తొలి అభ్యర్థిగా స్క్రీనింగ్ కమిటీకి దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం దరఖాస్తుల పరిశీలన చేస్తున్న కమిటీ తాజాగా అభ్యర్థులకు పరీక్షలు నిర్వహిస్తుంది. రాష్ట్రంలో సమకాలీన రాజకీయ అంశాలతో పాటు ఆయా నియోజకవర్గాల్లోని సమస్యల మీద అభ్యర్థులకు ప్రశ్నలను సంధిస్తోంది. ఈ రోజు రాత్రి వరకు దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కొనసాగే అవకాశం ఉండగా స్క్రీనింగ్ కమిటీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం వాటిని పవన్ కళ్యాణ్ దృష్టికి దృష్టికి వెళ్లనున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm