న్యూడిల్లీ : కేంద్ర ప్రభుత్వం మీడియాలో దళిత పదాన్ని నిషేధించడంపై దాఖలైన వ్యాజ్యాన్ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. షెడ్యూల్డ్ కులాలవారి గురించి చెప్పేటప్పుడు ప్రైవేటు చానెల్స్ దలిత శబ్దాన్ని వాడరాదంటూ సమాచార, ప్రసారశాఖ గత ఏడాది ఆగస్టు 7న ఓ సర్క్యులర్ జారీచేసింది. షెడ్యూల్డ్ కులాలవారు అని మాత్రమే చెప్పాలని, దళిత పదాన్ని అసలు వాడరాదని ఆ సర్క్యులర్ సారాంశం. అన్ని అధికారిక వ్యవహారాల్లో, ఉత్తరప్రత్యుత్తరాల్లో, లావాదేవీల్లో షెడ్యూల్డ్ కులాలు అని మాత్రమే వాడాలని కూడా ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ వీఏ రమేశ్నాథన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదించేందుకు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సోమవారం కోర్టు ముందు హాజరయ్యారు. అస్తిత్వానికి సంబంధించిన ఓ పదాన్ని కేంద్రం ఎలా నిషేధిస్తుందని ఆయన ప్రశ్నించారు. కోర్టు వాదోపవాదాల్లోకి వెళ్లకుండా ప్రస్తుత దశలో ఈ పిటిషన్ను పరిశీలించలేమని తెలిపింది. కేసును కొట్టివేసింది.
Mon Jan 19, 2015 06:51 pm