పాట్నా : పుల్వామా ఉగ్రదాడిలో బీహార్కు చెందిన ఇద్దరు జవాన్లు సంజయ్ కుమార్ సిన్హా, రతన్ కుమార్ ఠాకూర్ వీరమరణం పొందిన విషయం తెలిసిందే. ఈ రెండు కుటుంబాల్లో ఒక కుటుంబాన్ని దత్తత తీసుకుంటానని షేక్పురా జిల్లా కలెక్టర్ ఇనాయత్ ఖాన్ వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తమ జిల్లాలో ఒక అకౌంట్ ఓపెన్ చేసి విరాళాలు సేకరిస్తున్నామని తెలిపారు. మార్చి 10వ తేదీ వరకు విరాళాలను సేకరించి.. వచ్చిన డబ్బును రెండు భాగాలుగా చేసి అమర జవాన్ల కుటుంబాలకు అందజేస్తామని చెప్పారు. ఈ రెండు కుటుంబాల్లో ఒక కుటుంబాన్ని దత్తత తీసుకొని వారికి అండగా ఉంటానని కలెక్టర్ పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm