న్యూఢిల్లీ: పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్, భారత్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. పాక్ను కట్టడి చేయడంలో భాగంగా ఆదేశం నుంచి దిగుమతి చేసుకుంటున్న ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని 200శాతానికి పెంచారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న పాక్ను అష్టదిగ్భందనం చేసేందుకు ఉన్న అన్ని అవకాశాలను భారత్ ఉపయోగించుకుంటోంది. ఐతే షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 20-28 మధ్య న్యూఢిల్లీ వేదికగా షూటింగ్ ప్రపంచకప్ జరగాల్సి ఉంది. కఠిన పరిస్థితుల్లో కూడా భారత ప్రభుత్వం సానుకూల దృక్పథంతో వ్యవహరించింది. టోర్నీలో పాల్గొనేందుకు వచ్చే పాకిస్థాన్ షూటర్లకు వీసా ఇచ్చేందుకు కేంద్రం అనుమతినిచ్చింది.
Mon Jan 19, 2015 06:51 pm