హైదరాబాద్ : బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్యపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014లో టీడీపీని, 2018లో కాంగ్రెస్ దగ్గరనున్న ఆయన.. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వెళ్లారంటూ మండిపడ్డారు. కేవలం బీసీ నాయకుడివనే రాహుల్ గాంధీ.. మిర్యాలగూడ సీటు ఇచ్చారన్న వీహెచ్.. మరి ఏపీలో బీసీలకు ఎక్కువ సీట్లు కావాలని కృష్ణయ్య ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. అవకాశవాద బీసీ రాజకీయ నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వీహెచ్ విజ్ఞప్తి చేశారు. బీసీలు రాజ్యాంగ పదవులు చేపట్టరాదా? కుల వృత్తికే పరిమితం కావాలా? అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలోనే అన్ని పార్టీల నేతలకు బీసీలు గుర్తుకు వస్తారని సెటైర్లు వేసిన వీహెచ్.. చేసేది తక్కువ.. చెప్పుకునేది ఎక్కువ అని వీహెచ్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ దీర్ఘకాలిక ఆలోచనలు చేస్తోందన్న ఆయన.. బీసీలకు పెట్టిన క్రిమీలేయర్ ఎత్తివేయాలని వీహెచ్ డిమాండ్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm