న్యూడిలీ: కేంద్ర ప్రభుత్వం ఒప్పుకునే వరకు భారత్-పాకిస్థాన్ మధ్య ధ్వైపాక్షిక సిరీస్ జరిగే అవకాశం లేదని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఛైర్మన్ రాజీవ్ శుక్లా తెలిపారు. రానున్న ప్రపంచ కప్లో భారత్-పాక్ మధ్య జరగాల్సిన మ్యాచుల గురించి తాను ఇప్పట్లో ఏ విషయమూ చెప్పలేనని వ్యాఖ్యానించారు. జమ్ముకశ్మీర్లోని పుల్వామాలో ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... భారత్-పాక్ ధైపాక్షిక మ్యాచులపై మా తీరు స్పష్టంగా ఉంది. ప్రభుత్వం ఒప్పుకునే వరకు పాక్తో టీమిండియా ఆడదు. అన్ని అంశాలకు అతీతంగానే క్రీడాస్ఫూర్తి ఉండాలి. కానీ, ఒకరు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంటే ఆ ప్రభావం క్రీడలపైన కూడా పడుతుంది్ణ అని వ్యాఖ్యానించారు.
Mon Jan 19, 2015 06:51 pm