పుల్వామా: జమ్ముకశ్మీర్లోని పుల్వామా జిల్లా పింగ్లాన్ వద్ద సైన్యం-ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఉదయం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక మేజర్ సహా ముగ్గురు ఆర్మీ జవాన్లు వీరమరణం పొందారు. ఈ నేపథ్యంలో పింగ్లాన్ ప్రాంతంలో భద్రతా బలగాలు తనిఖీలను ముమ్మరం చేశాయి. ఓ భవనంలో ఉగ్రవాదులు ఉన్నట్లు అనుమానించిన సైన్యం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. దీంతో ఉగ్రవాదులు కాల్పులు మొదలుపెట్టారు. ఈ ఎన్కౌంటర్లో ఇప్పటి వరకు ఒక లెఫ్టినెంట్ కల్నల్, మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm