హైదరాబాద్: ఆర్జీవీ'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై సర్వత్రా ఆసక్తి నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై ఒక పక్క విమర్శలు వెల్లువెత్తుతున్నా.. మరోపక్క అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. ఆర్జీవీ గురించి మాట్లాడారు. జీవితాలను ఆర్జీవీ స్పష్టంగా చూడగలరని.. దాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూపగలరని అన్నారు. ఆయన వ్యక్తిత్వం ఇప్పుడు తనకు బాగా అర్థమైందన్నారు. తన జీవితానికి 23 ఏళ్ల తర్వాత నిరూపించుకునే అవకాశం దొరికిందని అన్నారు. ఆర్జీవీ సినిమా కోసం తాను కూడా ఎదురు చూస్తున్నానంటూ లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు.
Mon Jan 19, 2015 06:51 pm