హైదరాబాద్: ఎస్సెస్సీ, ఇంటర్ ఓపెన్ స్కూల్ పరీక్షలు ఏప్రిల్లో జరగనున్నాయి. తెలంగాణ ఓపెన్ స్కూల్(టాస్) డైరెక్టర్ ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు. ఈ పరీక్షలకు హాజరు కాదలచిన విద్యార్థులు ఫీజును ఈ నెల 21 నుంచి మార్చి 1 వరకు చెల్లించవచ్చు. అభ్యర్థులు పరీక్ష ఫీజులను మీ-సేవ /ఏపీ ఆన్లైన్/టీఎస్ ఆన్లైన్ సెంటర్ల ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.
Mon Jan 19, 2015 06:51 pm