హైదరాబాద్: టెక్సాస్ లో ఓ తెలుగు యువకుడు దారుణానికి తెగబడ్డాడు. కుటుంబ కలహాల కారణంతో తన భార్యను చంపి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, తెలుగు సంఘాల నాయకులు వెల్లడించిన వివరాల ప్రకారం, నెకరకంటి శ్రీనివాస్ అనే వ్యక్తి, ఇక్కడి ఓ ఇంధన కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, అతనికి భార్య శాంతి, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. నిన్న ఆ ఇంటి నుంచి తుపాకీ శబ్ధాలు వినిపించడంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వచ్చారు. అప్పటికే శాంతి, శ్రీనివాస్ లు విగత జీవులుగా కనిపించారు. ఆ సమయంలో వీరి కుమార్తె ఇంట్లోనే తన గదిలో ఉండగా, కుమారుడు చదువు నిమిత్తం కాలేజీకి వెళ్లి ఉన్నాడని పోలీసులు తెలిపారు. శ్రీనివాస్, శాంతి మధ్య గొడవ ఎందుకు జరిగిందన్న విషయమై కుమార్తె వద్ద సమాచారం లేదని వెల్లడించారు. కేసును విచారిస్తున్నామని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm