అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేటి నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరపనున్నారు. అందులో భాగంగా ఈరోజు మచిలీపట్నం, విజయవాడ, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాలపై చంద్రబాబు సమీక్ష చేస్తారు. ఈ సమీక్షకు ఆయా జిల్లాల పార్టీల నేతలు, ఇంఛార్జులు హాజరుకానున్నారు. ఇప్పటికే ఒకసారి కొన్ని పార్లమెంటు నియోజకవర్గాలపై చంద్రబాబు సమీక్ష జరిపారు.ఈ రోజు నుంచి మిగతా పార్లమెంట్ నియోజకవర్గాలపై దృష్టి పెట్టనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm