లక్నో: మోడీ సర్కార్పై సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఫైర్ అయ్యారు. దేశానికి బుల్లెట్ రైళ్లు అవసరం లేదని, కానీ సైనికులకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కావాలన్నారు. లక్నోలో మీడియాతో మాట్లాడుతూ.. మన ఇంటెలిజెన్స్ ఎందుకు విఫలమవుతుందని ఆయన ప్రశ్నించారు. పుల్వామా దాడిని గుర్తు చేస్తూ .. జవాన్ల కుటుంబాలకు దేశం అండగా ఉందన్నారు. అన్ని పార్టీలు తమ రాజకీయ వ్యవహారాలను పక్కనపెట్టి, సురక్షితమైన సరిహద్దు కోసం దీర్ఘకాలిక వ్యూహాన్ని రచించాలన్నారు. మరోవైపు దేశంలోనే తొలి సెమీ హై స్పీడ్ రైలు వందేభారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభించిన తొలిరోజే సాంకేతిక సమస్యలతో నిలిచిపోవడంపైనా ఆయన విమర్శలు గుప్పించారు. అభివృద్ధి అంటూ వందేభారత్ గురించి చెబుతున్నారు. దేశంలో రైతులు ఆగ్రహంతో ఉన్నారు. యువతకు ఉద్యోగాల్లేవ్. భద్రతావ్యవస్థ కుప్పకూలింది. ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది అని ఆయన ధ్వజమెత్తారు.
Mon Jan 19, 2015 06:51 pm